48 గంటల బంద్
విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 48 గంటల బంద్ కు సమైక్యవాదులు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో జాతీయ రహదార్లు దిగ్భంధించినట్లు జేఏసీ నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం, శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు బంద్ కు పిలుపునిచ్చని నేతలు తెలిపారు. 48 గంటల బంద్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులను అధికురులు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
News Posted: 18 December, 2009
|