వరికి మద్దతు ధర
నెల్లూరు : జిల్లాలో వరి పంటకు కనీస మద్దతు ధర అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ సౌరభ్ గౌర్ వెల్లడించారు. రైతు సంఘాల ప్రతినిధులు, భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల సంస్థ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. గ్రేడ్ ఎ రకానికి 1030, కామన్ రకానికి 900 రూపాయలు చెల్లిస్తామని జేసీ చెప్పారు. కొనుగోలు ప్రాంతాల్లో తప్పనిసరిగా తేమ యంత్రాలు ఉంచాలని ఆదేశించారు.
News Posted: 6 January, 2010
|