అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కుసుమ కుమారిని రీకాల్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేసారు. ఈ మేరకు స్థానిక టవర్ క్లాక్ వద్ద కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అడ్డదారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను వీసీ చేపట్టారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. రాత్రికి రాత్రే నియామకాలు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారన్నారు.