కర్నూలుః రాష్ట్ర మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఇంటిపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిథిలోని మండల కేంద్రమైన అస్పరిలో ఉన్న ఆయన ఇంటిపై బుధవారం మధ్యాహ్నం సుమారు ఇరవై మందికి పైగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారు మొదట ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆ తరువాత ఇంటి కిటికీ అద్దాలు పగులకొట్టారు. అనంతరం అక్కడే ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేసి నినాదాలు చేశారు.