21 నుంచి శివరాత్రి మహోత్సవాలు
తొండూరు: సైదాపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలను ఈనెల 21 నుంచి 23వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త వై.మల్లికార్జున రెడ్డి తెలిపారు. 21 నుంచి 23వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త వై.మల్లికార్జున రెడ్డి తెలిపారు. 21వ తేదీ ఉదయం గణపతి ప్రార్థన, గీతాపారాయణం, 22వ తేదీన ప్రాత:కాలార్చనం, గీతాపారాయణం, చెక్కభజనలు, 23వ తేదీ ఉదయం 6 గంటలకు గీతాపారాయణం, 7 గంటలకు ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం, ఎనిమిది గంటలకు శ్రీశివపార్వతుల కళ్యాణం, మహా మంగళహారతి, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రి శ్రీ స్వాములవారి గ్రామోత్సవం జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News Posted: 18 February, 2009
|