నిజామాబాద్ : సూపరింటెండెంట్ తమను వేధిస్తున్నారంటూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. దీంతో వైద్య సేవలు లభించకపోవడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆసుపత్రిలో ఉన్న 19 మంది వైద్యుల్లో 13 మంది కాంట్రాక్ట్ పై పని చేస్తున్నారు. అందులో ఒకరు రాజీనామా చేయగా మిగిలి వారు మూకుమ్మడి సెలవుపై వెళ్ళారు. డ్రైవర్లు సైతం పై అధికారిపై ఆరోపణలు చేస్తూ సెలవు పెట్టారు.