డాక్యుమెంటరీ చిత్రోత్సవం
కరీంనగర్ : జిల్లాలో జాతీయస్థాయి డాక్యుమెంటరీ చిత్రోత్సవాల ప్రదర్శన గురువారం నుండి ఫిలింభవన్ లో నాలుగు రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఎంపికైన ఉత్తమ చిత్రాలకు ఇండియన్ రోలర్ అవార్డుల కింద పాలపిట్ట జ్ఞాపికలను బహూకరిస్తారు. జాతీయ వ్యాప్తంగా వచ్చిన 41 లఘు చిత్రాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఢిల్లీ, కేరళ, ముంబయి, అండమాన్ నికోబార్ దీవులు ఇంఫాల్, హైదరాబాద్ నుండి దీనికి ఎంట్రీలు వచ్చాయి. జ్యూరీ చైర్మన్ గా దర్శకుడు అక్కినేని కుంటుంబరావు వ్యవహరిస్తున్నారు.
News Posted: 19 February, 2009
|