కరీంనగర్ లో వైఎస్ పర్యటన
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సింగరేణి స్థలాలను ఆక్రమించుకొని నివాసముంటున్న 17 వేల కుటుంబాలకు నామమాత్రమపు రేట్లపై వైఎస్ ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు.
ముందుగా బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ స్పీకర్, దివంగత శ్రీపాదరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తదుపరి రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రూ.60 లక్షలతో తలపెట్టిన కమ్యూనిటీ హాల్ భవనాలకు శంకుస్థాన చేస్తారు.
News Posted: 23 February, 2009
|