ఆటోను ఢీ కొట్టిన ప్యాసింజర్ రైల్
అనంతపురం: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను అనంతపురం-గుంతకల్లు ప్యాసింజర్ రైల్ ఢీ కొట్టింది. ఈ సంఘటనతో ఆటోలో వెళ్తున్నవారిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, శిథిలాలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.
News Posted: 23 February, 2009
|