కడపలో వైఎస్ పర్యటన
కడప : ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన పలు నియోజవకవర్గాల్లో పర్యటించి శంకుస్థానలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలో బద్వేలు మున్సిపాలిటీ నీటి సరఫరాకు గాను రూ.22.35 కోట్లు రూపాయలతో ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే నరసాపురం వద్ద 350 లక్షలతో హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. పెనగలూరు మండలంలో ఆర్ డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 17 హ్యాబిటేషన్లకు సంబంధించి నీటి సౌకర్యం కోసం 55 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించనున్నారు. పిఆర్ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో 184.75 లక్షల వ్యయంతో శ్రీకోదండరామస్వామి టెంపుల్ అభివృద్ధి పనులను, అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి 114.31 లక్షల అభివృద్ధి పనులుకు సిఎమ్ శంకుస్థాన చేయనున్నారు.
News Posted: 26 February, 2009
|