లారీ ట్రాక్టర్ ఢీ: 6 మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు. పెళ్ల కూరు మండలం గుర్రప్పతోట వద్ద పెళ్లి వారితో వెళ్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీ కొనటంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరో పదిమంది గాయపడ్డారు. చిత్తురూ జిల్లా కేవీపీ పురం మండలం కాలంగియాదం గ్రామానికి చెందిన గిరిజనులు వివాహ వేడుకకోసం ట్రాక్టర్లో బయలు దేరి ఓజిలి మండలం మానవాల గ్రామానకి వస్తున్న ట్రాక్టర్ ను, కాళహస్తి వైపు వెళుతున్న లారీ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
News Posted: 27 February, 2009
|