సిద్దార్థకు శ్రద్ధాంజలి
నిజామాబాద్ : అనతి కాలంలోనే అంతరిక్ష పరిశోధనా రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగిన ఏకైక భారతీయుడు సిద్దార్థకు నిజామాబాద్ వాసులు శ్రద్ధాంజలి ఘటించారు. అయిదేళ్ల కాంట్రాక్ట్ పై అంగారక గ్రహానికి అంతరిక్ష మార్గాన్ని అన్వేషించేందుకు యూరోపియన్ దేశాలు సంయకుత్తంగా చేపట్టిన ప్రాజెక్టులో సిద్ధార్థ పనిచేస్తున్నారు. ఆయన మార్చి మొదటి వారంలో నిజామాబాద్ రావలసి ఉంది. ఈలోగా అకస్మాత్తుగా మరణించారు. అతని తల్లితండ్రులు నిజామాబాద్ లో డాక్టర్లుగా పనిచేస్తున్నారు. సిద్ధార్థ మృతదేహం ఇంటికి చేరగానే పలువురు ఆయనకు అశ్రు నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.
News Posted: 27 February, 2009
|