ఏలూరు : విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన అన్నదాత విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించాడు. సబ్ స్టేషన్ లోని సిబ్బందిన గదిలో నిర్బంధించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్ి మండలం యర్ణగూడెంలో ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయాలంటూ ఈ సందర్భంగా వారు విద్యుత్ అధికారులను ఘెరావ్ చేశారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోతే ఆరుగాలం కష్టించి వేసిన తమ పంటలు చేతికి వచ్చే ముందు కొరగాకుండా పోతాయని రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు.