రాజమండ్రి : పీలేరు నదిలో జరిగిన నాటు పడవ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా వై. రామవరం మండలం బురదకోట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో ఎంతమంది ఉన్నారన్నదీ కచ్చితంగా తెలియరాలేదు. ఐదేళ్ళ చిన్నారి మృతదేహం మాత్రమే లభ్యమైందని అధికారులు తెలిపారు. పడవ ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. నీటిలో ఇంకా ఎవరైనా మునిగిపోయారా అని గాలిస్తున్నారు.