మరణ వాంగ్మూలం
అనంతపురం : హత్య కేసులో మరణ వాంగ్మూలానికి ఎంతటి ప్రాముఖ్యత వుందో ఈ తీర్పు మరోసారి స్ఫష్టం చేస్తోంది. గుంతకల్లులో నివాసముంటున్న ఇ.మల్లికార్జునకు, కళ్యాణదుర్గానికి చెందిన వరలక్ష్మికి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ మల్లికార్జున చెడు అలవాట్లకు లోనై భార్యను వేధిస్తూ, మరో స్త్రీతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. కొంతకాలానికి ఆమెను నేరుగా ఇంటికే తీసుకురావడంతో భార్య అడ్డు చెప్పింది. దాంతో ఆగ్రహించిన భర్త, భార్యపై కిరోసిన్ పోసి ఆమెను సజీవదహనం చేశాడు. ఆ మంటల్లో అతనూ గాయపడ్డప్పటికీ వరలక్ష్మి కొనవూపిరితో ఆస్పత్రిలో చేరి మెజిస్ట్రేట్ కు మరణ వాంగ్మూలం ఇవ్వడంతో మల్లికార్జునకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
News Posted: 4 March, 2009
|