'సెల్' తెచ్చిన వివాదం
నెల్లూరు : ఫ్లైయింగ్ స్క్వాడ్ కి, విద్యార్థులకు మద్ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు తోడు కావడంతో వారిదే పై చేయి అయింది. స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థుల సెల్ ఫోన్స్ ఫ్లైయింగ్ స్క్వాడ్ లో బయటపడడంతో వారి సెల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థులంతా తమ సెల్స్ ను ఇవ్వాలని కోరగా అధికారులు నిరాకరించడంతో ఆగ్రహించిన విద్యార్థులు స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులకు సమాచారం అందించారు. దాంతో వారు పాఠశాలకు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పిన్సిపాల్ కలుగజేసుకుని ఆర్ఐఓతో మాట్లాడి ఇంకొకసారి ఇటువంటి పొరపాట్లు చేయమని విద్యార్థులతో రాయించుకొని వారి సెల్స్ ను వారికిచ్చేయడంతో సమస్య పరిష్కారమైంది.
News Posted: 6 March, 2009
|