మందకృష్ణపై మండిపాటు
కడప : మా సంపదనంతా రాసిస్తాం చనిపోయిన నా భర్తను తిరిగిమ్మని రాజు భార్య సుజాత మందృకృష్ణ మాదిగపై మండిపడ్డారు. గత నెల 28న గాంధీభవన్ పై దాడి ఘటనలో తీవ్రంగా గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్రహ్మణ్య రాజు మరణించిన సంగతి విధితమే. ఆ ఘటనలో మరణించినవారికి 5 లక్షల నష్ట పరిహారాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ప్రకటించారు. దీనిపై ఎస్పీవో భార్య సుజాత తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తామే 5 లక్షలు ఇస్తామనీ తమ తండ్రిని తిరిగి ఇవ్వాలని రాజు కుమార్తెలు డిమాండ్ చేశారు.
News Posted: 7 March, 2009
|