వైభవంగా సాయి వ్రతాలు
అనంతపురం : అనంతపురంలోని శ్రీనివాస నగర్ లో శ్రీ షిరిడీ సాయి సత్యవ్రతాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆథ్యాత్మిక గురువు సాయి రమణానంద భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. షిరిడిలో కొలువైన సాయిని ఎవరైనా, ఎక్కడి నుంచైనా సాయీ అంటూ మనసారా పిలిస్తే ఓయీ అంటూ పలికే దివ్యభగవానుడు షిరిడీ సాయినాధుడని పేర్కొర్కొన్నారు. సాయి నామాలు జపిస్తూ, భజనలు చేస్తూ సంపూర్ణమైన మనసును ఆయనకు అర్పించాలన్నారు. అధిక సంఖ్యలో సాయి సత్యవ్రతాల్లో పాల్గొన్న భక్తులు తముందు సాయి ప్రతిమను ఉంచి, గురువు చెప్పిన విధంగా సత్యవ్రతాలను నిర్వహించారు. ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి అంటూ మంత్రాన్ని జపిస్తూ భయనలు చేశారు. ద్వారాకామాయి సత్సంగ మండలి అధ్యక్షురాలు వై.భారతిరెడ్డి, వేణుగోపాల్ నగర్ సాయి మందిర్ ప్రతినిధి వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News Posted: 11 March, 2009
|