కరీంనగర్ : జిల్లాలోని మేడిపల్లి మండలం మల్లాపూర్ విఆర్వో మోహన్ రావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఒక పని చేసేందుకు బాధితుడి నుంచి విఆర్వో నాలుగు వేల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. దీనితో శనివారం ఉదయం బాధితుడి నుంచి విఆర్వో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.