కూటమి అభ్యర్థికి చుక్కెదురు
కరీంనగర్ : మహాకూటమి తరఫున స్థానిక సంస్థలకు సంబంధించిన శాసనమండలి స్థానానికి జరిగే ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థి భూంరావ్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. భూంరావ్ తన పేరును తప్పుగా చూపించడంతో పాటు ప్రభుత్వ
ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తుండడంతో నామినేషన్ ను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరించారు. దీనికి తోడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాజ్ కుమార్ పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భూంరావ్ నామినేషన్ తిరస్కారం పొందడం, రాజ్ కుమార్ బరి నుంచి తప్పుకోనుండడంతో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి భాను ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయింది. అయితే, తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కడంపై కోర్టులో సవాల్ చేస్తానని భూంరావ్ మీడియాకు తెలిపారు.
News Posted: 16 March, 2009
|