చేగొండికి సతీ వియోగం
హైదరాబాద్ : సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రజారాజ్యం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్ చేగొండి హరిరామ జోగయ్య సతీమణి డాక్టర్ భారతి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆమె గత కొంతకాలంగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించినట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. చేగొండి సతీమణి మృతికి పలు పార్టీల నాయకులు, సన్నిహితులు నివాళులు అర్పించారు. కాగా, సోమవారం ఉదయం డాక్టర్ భారతికి జరిగిన అంత్యక్రియలకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్, ఇతర ముఖ్య నాయకులు, రాష్ట్ర హోం మంత్రి కుందూరు జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.
News Posted: 16 March, 2009
|