రాజమండ్రి : మూడు దశాబ్దాల పాటు తన నట జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు వర్థంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని గోదావరి నది ఒడ్డున రాజమండ్రిలో శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహానటుడు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మనతో పాటే ఉన్నాయన్నారు. చిత్ర పరిశ్రమలో కానీ మరెక్కడా కానీ ఆయనకు మరెవరూ సాటిరాలేరని దాసరి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నటభూషణుని అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు.