25న కెసిఆర్ పర్యటన
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కేంద్రంలో కె.చంద్రశేఖర్ రావు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 25న ఆయన నిజామాబాద్ లో బహిరంగ సభను ఖలీల్ వాడి మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సభకు తెరాస అధినేతతో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ విజయశాంతి, జిల్లా ఇన్ చార్జీ హరీష్ రావులు పాల్గొననున్నారు. తెరాస అధ్యక్షులు ఎ.ఎస్.పోశెట్టి బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బి.రామాంజనేయులుకు గురువారం లిఖిత పూర్వంకగా వినతిపత్రాన్ని అందజేయగా బహిరంగ సభకు అనుమతి మంజూరయ్యిందని, డిఎస్పీ నుండి కూడా మైకు అనుమతి పొందినట్లు ఆయన తెలిపారు వివరించారు.
News Posted: 20 March, 2009
|