మల్లన్న సన్నిధిలో ఉగాది
శ్రీశైలం : ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మంగళవారం నుంచి తెలుగు వారి సంవత్సరాది ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకూ ఈ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే శ్రీశైలానికి లక్ష మందికి పైగా భక్తులు పోటెత్తడంతో శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మల్లికార్జునస్వామి ఆలయంలో యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, శవసంకల్పం, చండీహోమం నిర్వహిస్తారు. భ్రమరాంబ అమ్మవారికి ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు విశేష అలంకారు చేస్తారు. మంగళవారంనాడు మహాలక్ష్మి అలంకారం నిర్వహిస్తారు. మల్లికార్జున స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి భృంగి వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 26న వీరశైవుల విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, రథోత్సవం నిర్వహిస్తారు.
News Posted: 24 March, 2009
|