శ్రీశైలేశుని ప్రభవోత్సవం
శ్రీశైలం : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీశైలేశుని ప్రభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆది దంపతులను నంది వాహనంపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగిస్తూ ఆలయప్రాంగణం నుండి రథశాల వద్దకు తీసుకువచ్చారు. అమ్మవారు మహా సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దివ్యమంగళరూపాన్ని కనులారా దర్శించి కర్పూర నిరాజనాలర్పించారు. ఈఈ రామిరెడ్డి, ఈఓగోపాలకృష్ణారెడ్డి పూజలు నిర్వహించి వేదమంత్రోచ్ఛారణాల మధ్య అత్యంత వైభవంగా ఈ ప్రభవోత్సవాన్ని ప్రారంభించారు. కర్నాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది భక్తజనం ఈ ప్రభవోత్సవానికి కలకండ, ఖర్జూరాది దినుసులను భక్తి పూర్వకంగా స్వామివారికి సమర్పించారు. ప్రభవోత్సవంలో సుమారు నాలుగు లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా.
News Posted: 27 March, 2009
|