కరీంనగర్ : శ్రీ విరోధి నామ సంవత్సరం ఎన్నికల కోలాహలంలో రావడంతో ఓటర్లు కాస్త దేవుళ్లయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కొద్ది కాలాన్ని ఉపయోగించుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఓటరను ప్రసన్నం చేసుకోవడమే రాజకీయ పార్టీల లక్ష్యంగా సాగుతోంది. ప్రజల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలదీ 'ఓటు' బాటే అవుతోంది.