క్షేమంగా వెళ్ళి...
కర్నూలు : ఎలక్ట్రికల్ పని చేయడానికి మోటారు బైక్ మీద వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు నన్నూరు గ్రామ సమీపంలో 18వ జాతీయ రహదారిపై చింతలముని స్వామి దేవాలయం వద్ద టిప్పర్ డీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి ఎలక్ట్రికల్ పనులు చేయడానికి వళ్తున్న నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన జేమ్స్, సోమన్న, సురేంద్రలు మోటార్ సైకిల్ పై కర్నూలుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సోమన్న, సురేంద్రలు అవివాహితులు కాగ, జేమ్స్ భార్య మైజితో మనకు ఇద్దరాడపిల్లలు ఉన్నారనీ వారికోసం కష్టపడక తప్పదనీ భార్యకు నచ్చజెప్పడంతో సరేనన్న భార్య మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని సాగనింపింది. ఈ సమాచారం అందడంతో ఆమె కుప్పకూలింది. జేమ్స్, సురేంద్ర, సోమన్న బందువులు, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ శివన్న, శంకర్ కర్నూలు సర్వజన వారిని ఆస్పత్రికి తరలించారు.
News Posted: 30 March, 2009
|