కరీంనగర్ : కరీనంగర్ జిల్లా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కెసిఆర్ తనయుడు కె.తారక రామారావుపై మహేందర్ రెడ్డి వర్గీయులు దాడి చేశారు. కరీంనగర్ లో ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ దాడి నుండి ఆయన తప్పించుకున్నారు ఇరువర్గాల తోపులాటకు దిగడంతో పోలీసులు రంగరప్రవేశం చేసి వీరిని చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. టిఆర్.ఎస్ లో ఇంకా అసంతృప్తుల దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది.