కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడి పల్లెలో 150 మంది అస్వస్థకు గురయ్యారు. దాంతో రంగంలోనికి దిగిన వైద్య బృందం వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. కలుషిత నీరు త్రాగడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. నీటిని యుద్ధ ప్రాతిపదికన శుద్ధి చేయించి ప్రాధమిక చికిత్స చేశారు.