పిఆర్పీ కార్యకర్తల వీరంగం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో లోక్ సభ టిక్కెట్ చలమలశెట్టి సునీల్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పిఆర్పీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వారు పిఆర్పీ కార్యాలయంపై దాడికి దిగారు. ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు.
News Posted: 3 April, 2009
|