విస్తృతంగా తనిఖీలు
కరీంనగర్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్డు మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలిసులు రైలు మార్గాలపై కూడా దృష్టి సారించారు. బలార్షా, కాజీపేటల మధ్య పలు రైళ్లలో పోలీసులు పెద్ద సంఖ్యలో తనిఖీలు చేయడంతో బాంబులు ఉన్నాయేమోనని ప్రయాణీకులు భయాందోళనలు చెందారు. కారణం తెలియడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.
News Posted: 3 April, 2009
|