కడప : కాంగ్రెస్ మహిళ నాయకురాలిపై ప్రజారాజ్యం కార్యకర్తలు దాడి చేశారు. కడప జిల్లాలోని ఖాజీపేట మహిళ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మిపై పిఆర్పీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆమె గాయపడింది. దాంతో ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.