నెల్లూరు: జిల్లాలో ఎన్నికల నిర్వహణ విధులకు విముఖత చెప్పిన వివిధ శాఖలకు చెందిన 400 సిబ్బంది పైజిల్లా కలెక్టర్ రామ్ గోపాల్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల విధులకు ఉద్యోగులు వెళ్ళేందుకు నిరాకరించడంతో ఈ మేరకకు కలెక్టర్ అల్టిమేటం జారీ చేశారు. విధులకు విముఖత చూపిన సిబ్బందిని సస్పెన్షన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.