కరీంనగర్ : ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా పెగడపల్లిలో అక్రమంగా గోదాం లో దాచి ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. కాగా ఇది ఎవరిదన్న విషయం తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.