సిఎమ్ రోడ్ షో
కర్నూలు : మలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, నందికొట్కూరు, ఆలూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి పర్యటించనున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగిలో, తదుపరి ఆలూరు చేరుకొని అక్కడ షాదీఖానా నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి నందికొట్కూరు చేరుకొని షికారీ పేట నుంచి పటేల్ సెంటర్ పాతబస్టాండ్ మీదుగా బ్రహ్మంగారి మఠం వరకు రోడ్ షో నిర్వహించి పగిడ్యాల రోడ్డులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిఎమ్ పలు చోట్ల హాజరుకానుండడంతో ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులు రోడ్ షోలను, సభలను విజయవంతం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
News Posted: 20 April, 2009
|