కేసీఆర్ పై 'కూర' కారాలు
కరీంనగర్ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చి, స్వార్థమే పరమావధిగా వ్యవహరిస్తున్న తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు ప్రజా కోర్టులో శిక్షిస్తామని జనశక్తి నాయకుడు కూర రాజన్న హెచ్చరించారు. బుధవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన రాజన్న కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తారో లేక ఉద్యమం పేరుతో దళారీ జీవితాలు గడుపుతారో తేల్చుకోవాలని కేసీఆర్ కు రాజన్న సవాల్ విసిరారు. మహాకూటమి అధికారంలోకి వస్తే పదవుల కోసం కక్కుర్తి పడకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసమే కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారో ప్రజలకు వివరంగా తెలియజెప్పాలని రాజన్న డిమాండ్ చేశారు.
News Posted: 22 April, 2009
|