ఆర్టీసీ బస్సు దోపిడి
అనంతపురం : జిల్లాలో నేడు ఒక ఆర్టీసీ బస్సు దోపిడీకి గురైంది. నెల్లూరు నుంచి బళ్లారి వెళ్తున్న బస్సు గొజ్జిపల్లికి చేరగానే గుర్తు తెలియని దుండగులు బస్సులోకి ప్రవేశించి మారణాయుధాలతో ప్రయాణీకులను బెదిరించి వారి వద్ద నుంచి 10 తులాల బంగారం, 6 సెల్ ఫోన్లు, కొంత నగదు దోచుకుపోయారు. ఈ దోపిడీ అనంతపురం గుత్తి-గుంతకల్ మధ్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 27 April, 2009
|