నిధులున్నా నీటి కరువే!
అనంతపురం : జిల్లాలో ప్రజలు మంచి నీటి అందుబాటులో లేక బాధపడుతున్నారు. నిధులున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల మంచినీటి సమస్యను పరిష్కరించకపోవడంతో ప్రజలు నీటి కోసం విలవిలలాడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వుంటుందని కలెక్టర్ జిల్లా యంత్రాంగంపై మండిపడ్డారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ అనిల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికీ కనీస మంటినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి మున్సిపాలిటీ అధికారులూ మంచినీరు సరఫరా అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అంకిత భావంతో, వ్యక్తగత శ్రద్ధతో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈలు విశ్వనాథన్, ప్రతాపరెడ్డి, ఆర్ డ్ల్యూఎస్, కలెక్టరేట్ ఏఓ గోవిందరాజులు, ఆయా శాఖల డివిజనల్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
News Posted: 30 April, 2009
|