కామాక్షీ, వైద్యనాథుల రథోత్సవం
కడప : పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకామాక్షీసమేత శ్రీ వైద్యనాథస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, వ్యాఖ్యానాలతో మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన రథంపై తేజో మూర్తులైన అమ్మవారూ, స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. కామాక్షీ సమేత వైద్యనాథ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి నారికేళ, కర్పూరాలను సమర్పించి స్వామివారి రథోత్సవాన్ని కనులారా వీక్షించారు. రథానికున్న తాళ్లను లాగడానికి యువకులు ఉత్సాహంతో ఉరకలు వేశారు.
News Posted: 30 April, 2009
|