కరీంనగర్ : కరెంట్ కోత తీవ్రం కావడంతో వరి పంట ఎండిపోయింది. దీంతో మనోవేదనకు గురైన అన్నదాత గుండె మూగబోయింది. కోనరావుపేట మండలం నిమ్మలపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తుమ్మల భీమయ్య అనే రైతు కొడుకులు లేకపోవడంతో అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొన్నాడు. గ్రామంలో కూలి పనులు దొరక్కపోవడంతో రెండు లక్షలు అప్పులు చేసి గల్ఫ్ కు పంపించాడు. భీమయ్య తనకున్న ఎకరం భూమితో పాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకొని వరి పంట సాగుచేశాడు. పంట ఎండిపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక మనోవేదనకు గురై గుండె పోటుతో మృతి చెందాడు.