వైభవంగా ఊంజల్ సేవ
కడప : అన్నమయ్య 601వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాజంపేటలో ఆదివారం రాత్రి శ్రీవారికి నిర్వహించిన ఊంజల్ సేవ ఎంతో వైభవంగా జరిగింది. తిరుమల నుండి తీసుకొచ్చిన శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి శాస్త్రోక్తంగా ప్రత్యేయక పూజలు నిర్వహించారు. ఓ వైపు స్వామివారి కీర్తనలు ప్రజలను భక్తి తన్మయత్వంలో ఓలలాడిస్తుండగా, మరోవైపు శ్రీదేవి, భూదేవిలతో శ్రీవారు ఊయలలో ఊగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తిరుమలలో జరిగే ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలో నిర్వహించడం, ఆ సేవను కనులారా తిలకించే అదృష్టం కలగడం తమ పూర్వ జన్మ సుకృతమని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. టిటిడి ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆధ్వర్యంలో బెంగుళూరు నుంచిన వచ్చిన హెలికాప్టర్ ద్వారా అన్నమయ్య 108 అడుగుల విగ్రహానికి ఆకాశం నుంచి పూలాభిషేకం చేశారు.
News Posted: 11 May, 2009
|