కరీంనగర్ : కరీనంగర్ జిల్లా చొప్పదండి సర్కిల్ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం మాటు వేసి పట్టుకున్నారు. ఓ కేసు విషయమై బాధితుడు సిఐని ఆశ్రయించగా సిఐ 20 వేలు డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని సిఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.