మచ్చుమర్రిలో అగ్ని ప్రమాదం
కర్నూలు : జిల్లాలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 25 గడ్డివాములు, 15 ఎడ్లు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. దీంతో స్థానుకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పెదకడుమూరు మండలం మచ్చుమర్రిలో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతూ పైరింజన్ సిబ్బందికి తెలియపరిచారు. కాగా ఫైరింజన్ రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని సమాచారం.
News Posted: 13 May, 2009
|