అనంతపురం : అనంపురం జిల్లాలో గురువారం ఓ ట్రాక్టర్ బోల్తా పడడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిందూపురం సమీపంలోని సంతెబిజనూరు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.