భీమవరంలో చోరీ
ఏలూరు : బంగారంతో వెళుతున్న ఓ వ్యక్తిని ఏమార్చి దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. నర్సాపురంలోని రాజేంద్ర జ్యువెరీ దుకాణానికి చెందిన ఓ వ్యక్తి భీమవరంలో బంగారం తీసుకుని నర్సాపురం వెళ్ళేందుకు బస్టాండ్ కు రావడంతో అతన్ని ఏమార్చి 36 లక్షలు విలువ చేసే బంగారంతో దుండగులు పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 20 May, 2009
|