కరీంనగర్ : జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు వున్నాయనే మాటలు షికార్లు చేయడంతో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లో ఈ విషయం చెలరేగింది. దుబాయి నుంచి వచ్చిన తిమ్మయ్య అనే వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండడంతో ప్రత్యేక వైద్య బృందం అతన్ని హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రికి తరలించారు.