స్తంభించిన జనజీవనం
కర్నూలు : కర్నూలులో సంజమాల మండలం రామభద్రుని పల్లెలో ఏకధాటిగా భారీవర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. నగరంలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. వర్షం ప్రారంభం కాగానే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అరగంటకు పైగా కర్నూలు నగరాన్ని గాడాంధకారం అలుముకుంది. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఈదురుగాలులకు చెల్లాచెదురయ్యాయి. పాతబస్తీతో పాటు నగరంలోని వ్యాపారాలన్నీ ఆగిపోయాయి. కొద్ది సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శివారు కాలనీ గీతాముఖర్జీనగర్ లో గుడిసెల పై కప్పులు గాలికి ఎగిరిపోయాయి. వర్షం కారణంగా మురికి కాలువల్లోని నీరు ప్రవహించడంతో రాజ్ విహార్ ప్రాంతంలో దుర్గందం వ్యాపించింది.
News Posted: 22 May, 2009
|