సీబీఐ వల్లో రైల్వే ఉద్యోగి
అనంతపురం : గుంతకల్లు రైల్వే ఉద్యోగి ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో జనరల్ బ్రాంచ్ స్టోర్స్ లో హెడ్ క్లర్క్ మునయ్య స్థానికంగా రైల్వేకు అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ ను లంచం కావాలంటూ డిమాండ్ చేశాడు .దాంతో ఆ కాంట్రాక్టర్ హైదరాబాద్ లోని సీబీఐ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న సీబీఐ బృందం అతన్ని సోదా చేసి కాంట్రాక్టర్ నుంచి తీసుకున్న లంచాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుండి మరింత సమాచారం సేకరించడానికి అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకెళ్ళినట్లు సమాచారం.