కిటకిలాడుతున్న శ్రీశైలం
కర్నూలు : శ్రీశైలం క్షేత్రంలో కొలువున్న శ్రీ భ్రమరాంబికామల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో దేవస్థానం కిటకిటలాడుతోంది. విద్యార్థులకు పరీక్షల పలితాలు విడుదల కావడంతో, వేసవి సెలవులు పూర్తికావొస్తుండడంతో మరింత రద్దీ ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో ప్రధాన వీదులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని తెల్లవారుజామున రెండు గంటలకే తలుపులు తెరిచారు. తదుపరి సుప్రభాతసేవ, మహామంగళహారతలు జరిగాయి. భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు జరుపుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో విడిది సౌఖర్యాలు చాలినన్ని లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
News Posted: 1 June, 2009
|