కరీంనగర్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో శ్రీరాంసాగర్ డిప్యూటీ ఎస్ ఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన వద్ద సుమారు రూ.60 లక్షల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అవినీతి శాఖ అధికారులు తెలిపారు.